ఈవీఎంలపై జగన్ ట్వీట్‌కు సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Rajesh |
ఈవీఎంలపై జగన్ ట్వీట్‌కు సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర పరాభవం తర్వాత తొలిసారిగా ఈవీఎంలపై వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పేపర్ బ్యాలెట్ సిస్టమ్ జరుగుతోంది కదా అని కొత్త వాదన లేవనెత్తారు. తాజాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ట్వీట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదన్నారు. ఏపీ ఎలన్ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంలది తప్పా అని ప్రశ్నించారు. 2019లో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలపై ఏం మాట్లాడారో జగన్ ఓ సారి గుర్తు చేసుకోవాలని సూచించారు. పరనింద, ఆత్మస్తుతి మాని ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed