- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వైసీపీ నేతలు రెచ్చగొడితే నేను డిబేట్లకు రావాలా?: మాజీమంత్రి నారాయణ
దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు నగర అభివృద్ధి పై చర్చకు రావాలని వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి నారాయణ ఆరోపించారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టినంత మాత్రాన తాను రెచ్చిపోయి డిబేట్లకు రాలేనని మాజీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం 6వ డివిజన్లోని స్టోన్ హౌస్పేట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పొంగూరు నారాయణ స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ డివిజన్లోని షాపులు, ఇంటింటికి తిరిగి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ... 2024లో టీడీపీ గెలుపుకు సహకరించాలని కోరారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ డివిజన్లో పర్యటించిన ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేయడం హేమమైన చర్య అన్నారు. వైసీపీ నేతలు కావాలని డిబేట్కు రండి అంటూ ఛాలెంజ్లు విసురుతున్నారని అన్నారు. డిబేట్లకు రావాలసిన అవసరం తనకు లేదని స్ఫష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే ఇంకా డిబేట్లకు రావడం ఎందుకన్నారు. నెల్లూరును తాను ఎంతలా అభివృద్ధి చేశానో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని మాజీమంత్రి పొంగూరు నారాయణ అన్నారు.