AP News:మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్

by Jakkula Mamatha |   ( Updated:2024-08-27 15:50:53.0  )
AP News:మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్
X

దిశ, డైనమిక్​బ్యూరో:మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌.. అగ్నిప్రమాదమా? కుట్రపూరితమా? అనే కోణంలో విచారణ చేయాలని ఆదేశించింది. ఈ విచారణను సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మదనపల్లి సబ్​ కలెక్టర్​ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మదనపల్లి కలెక్టరేట్​లో తెల్లవారుజామున మూడు గంటల వరకు సీఐడీ తనిఖీలు నిర్వహించారు.ఫైళ్ల దహనానికి సంబంధించిన సీన్​ రీకన్​స్ట్రక్షన్​ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్​తేజను విచారించారు. ఘటన సమయంలో బీరువాలో ఆయిల్​క్యాన్లపై వివరాలు సేకరించినట్టు సమాచారం. అడిషనల్​ డీజీ రవిశంకర్​ అయ్యన్నార్​ నేతృత్వంలోని బృందం ఈ విచారణ చేపట్టింది. ఈ బృందంలో ఎస్పీ విద్యాసాగర్​నాయుడు, అడిషనల్​ ఎస్పీ రాజ్​కుమార్​, సీఐడీ ఎస్పీ వేణుగోపాల్​ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed