‘నాకు ఆత్మహత్యే శరణ్యం..కాపాడండి’..విదేశాల్లో తెలుగు మహిళ ఆవేదన!

by Jakkula Mamatha |
‘నాకు ఆత్మహత్యే శరణ్యం..కాపాడండి’..విదేశాల్లో తెలుగు మహిళ ఆవేదన!
X

దిశ,వెబ్‌డెస్క్:భారత దేశంలోని యువత పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లడం చూస్తూనే ఉన్నాం. అందులో కొందరు యువకులని తీసుకెళ్లిన ఏజెంట్లు మోసం చేసి అక్కడే వదిలేస్తారు. అయితే ఇలా వెళ్లిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. తాజాగా ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన ఆంధ్రకు చెందిన ఓ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఏజెంట్ల మోసాలు, యజమానుల వేధింపులతో విదేశాలలో ఇబ్బంది పడుతున్న మహిళ ఆవేదన వెలిబుచ్చారు.

కువైట్‌లో పనిలో పెట్టుకున్న యజమాని సరిగా భోజనం పెట్టక చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె తన బాధను సెల్ఫీ వీడియో రూపంలో విడుదల చేసింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన మహిళ నాగమణి తన ఆరోగ్యం క్షీణించిందని, నోటి నుండి రక్తం వస్తున్నా యజమాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని తనను ఈ నరకం నుండి కాపాడాలని, వెంటనే ఇండియాకి తీసుకురావాలని ఆమె వ్యక్తం చేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed