ఏపీలో మోగనున్న సమ్మెసైరన్.. డిసెంబర్ 8 నుంచి విధులు బహిష్కరణ

by Seetharam |
AP government
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెబాట పట్టనున్నారు. డిసెంబర్ 8 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలు కలిసి ఉమ్మడిగా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమ్మెనోటీసును అందించినట్లు తెలుస్తోంది. ఈనెల 20న జిల్లాల్లో పీడీలు, సీడీపీఓలకు సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. అలాగే ఈనెల 23న రౌండ్ టేబుల్ సమావేశాలు, 25 నుంచి 30 వరకు సెక్టార్ సమావేశాలు నిర్వహించనున్నట్లు నేతలు తెలియజేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed