రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్..!

by Jakkula Mamatha |
రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్..!
X

దిశ,ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్ధమయ్యాయన్నారు. గురువారం నాటికి పదివేల కేసుల రూ.99 మద్యం మార్కెట్‌కు చేరిందని, సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20 వేల కేసులకు చేరుతుందని వివరించారు. దశల వారీగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ క్రమంలో మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం ఈ నెలలో అందుబాటులోకి రానుందన్నారు. వినియోగాన్ని అనుసరించి తదుపరి నెలలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దాని పై నిర్ణయం తీసుకుంటామని నిషాంత్ కుమార్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed