Breaking:రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

by Jakkula Mamatha |
Breaking:రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
X

దిశ,వెబ్‌డెస్క్:టీడీపీ పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియకు సంబంధించి ఆయన బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా SBI ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సీ.వీ భాస్కర్‌రెడ్డి SBI జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో ప్రతివాదులైన రిజర్వు బ్యాంక్, ఎస్‌బీఐలకు నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed