ప్రధాని భద్రత కోసం వచ్చి: తిరుమలలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ గుండెపోటుతో మృతి

by Seetharam |
ప్రధాని భద్రత కోసం వచ్చి: తిరుమలలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ గుండెపోటుతో మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత ప్రధాని నరేంద్రమోడీ తిరుమల పర్యటనలో భాగంగా భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం చెందడం కలకలం రేపుతోంది. మెట్ల దారి గుండా పైకి వెళుతుండగా 1,805 మెట్టు దగ్గర గుండెపోటుకు గురైన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నమూశారు. దీంతో తోటి అధికారులు డీఎస్పీ కృపాకర్ మరణవార్తను ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామంలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇకపోతే ఈనెల 26,27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలలో పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు శనివారం కపాకర్‌ తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్లదారిలో వెళ్తుండగా గుండెనొప్పికి గురై కుప్పకూలి మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed