- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీలో మారబోతున్న అధికారం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల పర్యటించి కూటమి తరపున ప్రసంగించనున్నారు. ఇప్పడికే షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. జనసమీకరణతో పాటు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో మార్పు చోటు చేసుకోబోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఆ రాష్ట్రంలో మిత్రపక్షాలను కలుపుకుని వెళ్తామని ప్రధాని తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై ఆయన స్పందించారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. ఏ పని జరగాలన్నా కమిషన్ ఇవ్వాల్సిందేనన్నారు. తెలంగాణలో ప్రస్తుతం డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని మోడీ విమర్శలు చేశారు.