ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ సూసైడ్.. కారణమదేనా?

by Rajesh |
ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ సూసైడ్.. కారణమదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ సూసైడ్ కలకలం రేపింది. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మువ్వల అలేఖ్య(29), భర్త నరేష్; వారి ఇద్దరు పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి ఎంవీపీ కాలనీలో నివాసముండేవారు. భర్త ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి వేరే ప్రాంతంలో ఉంటోంది. ఓ ఇల్లు అద్దెకె తీసుకు ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. కాగా ఆదివారం అర్థరాత్రి సమయంలో ఆమె గదిలో చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. కాసేపటికి తల్లి వేలాడుతుండటాన్ని చూసిన కూతురు ఏడుస్తూ సమాచారాన్ని ఫోన్ ద్వారా పలువురికి తెలిపింది. బంధువులు వెంటనే ఇంటికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. అలేఖ్య తల్లి భవాని భర్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed