- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
తెలుగు ప్రజలకు పవన్ కల్యాణ్ కీలక పిలుపు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్డెస్క్: తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. తెలుగు భాషను గౌరవించుకుందాం.. నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్య ఉండాలని అభిప్రాయపడ్డారు. నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కడితేనే ఈ దినోత్సవాలకు సార్థకత ఉంటుందని తెలిపారు. కాగా, ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Venkata Rammurthi) జయంతి సందర్భంగా.. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది.
Advertisement
Next Story