సైకో సీఎం కళ్లలో ఆనందం కోసం న్యాయదేవత కళ్లకు గంతలు: నారా లోకేశ్

by Seetharam |   ( Updated:2023-11-08 09:32:08.0  )
సైకో సీఎం కళ్లలో ఆనందం కోసం న్యాయదేవత కళ్లకు గంతలు: నారా లోకేశ్
X

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సైకో కళ్లల్లో ఆనందం కోసమే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘తప్పుడు కేసులు బనాయించడంలో కొంతమంది పోలీసులు గిన్నిస్ బుక్ లో స్థానం కోసం పోటీ పడుతున్నట్లుగా కన్పిస్తోంది. రొంపిచర్లకు చెందిన నరసరావుపేట నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు విచారణకంటూ తీసుకెళ్లి అక్రమ మద్యం కేసులో ఇరికించారు. గత నాలుగున్నరేళ్లుగా టిడిపి కార్యకర్తలు, నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా 60వేల తప్పుడు కేసులు బనాయించారు. సైకో సీఎం కళ్లలో ఆనందం కోసం న్యాయదేవత కళ్లకు గంతలుకట్టి టీడీపీ కేడర్ ను ఇబ్బందుల పాల్జేస్తున్న కొంతమంది పోలీసులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదు. గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed