- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
AP News: స్ట్రాంగ్ రూమ్ల వద్ద నో ఫ్లై జోన్
దిశ, ఏలూరు: స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు పటిష్టంగా వుందని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవిఎంలు భధ్రపరచిన స్థానిక వట్లూరు సర్ సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను మంగళవారం జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవిఎంల భధ్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవిఎంలకు కేంద్ర, రాష్ట్ర సివిల్ పోలీసులతో మూడంచెల భధ్రత కల్పించమన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు ఉన్న తాళాలను వాటికున్న సీళ్లను, అన్నిచోట్లా సిసి కెమేరాల పనితీరును కలెక్టర్, ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. మూడంచెల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్మ్డ్ , సివిల్ పోలీస్ బంధోబస్తును వారు పరిశీలించారు.
అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్ధితుల్లోను అనుమతించరాదన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంతోపాటు చుట్టుప్రక్కల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజువరకు స్ట్రాంగ్ రూమ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు . ఎటువంటి సమన్వయ లోపం రానివ్వకుండా ప్రత్యేక పోలీస్ అధికారుల పర్యవేక్షణ ఉందన్నారు. జిల్లా అధికారుల వెంట కైకలూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కె.భాస్కర్, యం.ముక్కంటి, పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.