యాక్షన్ మొదలైంది.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-10-11 10:39:59.0  )
యాక్షన్ మొదలైంది.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నాయకులకు మంత్రి నారా లోకేశ్ (Minister Nara lokesh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నాయకులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ చూపించి గతంలో చెప్పామని, ఈ మేరకు యాక్షన్ మొదలైందని ఆయన హెచ్చరించారు. బ్లూ, గుడ్ బుక్ అంటున్న వైసీపీ నాయకులు(Ycp Leaders) తనను చూసి ఇన్‌స్పైర్ అయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, బ్లూ బ్యాచ్ ఆగడాలతో కంపెనీలకు ఇబ్బంది అనిపిస్తే ఎంతటి వారినైనా క్షమించమని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తరలిపోయిన అన్ని కంపెనీలు మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. రాయలసీమ(Rayalaseema) తయారీ, ఉత్తరాంధ్ర(Uttarandhra) సేవా రంగాలకు కేంద్రాలుగా మారతాయని తెలిపారు. పరిపాలన మాత్రం ఒకే చోట జరుగుతుందని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed