- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వింతగా ఉంది.. జగన్ విద్యార్హతపై లోకేశ్ సెటైర్స్
దిశ, ఏపీ బ్యూరో: ‘నువ్వు ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు. నువ్వు విద్యా శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేక్ జగన్!. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది..’ అంటూ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్... పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కు గట్టి జవాబిచ్చారు. విద్యావ్యవస్థపై జగన్ చేసిన విమర్శలకు లోకేశ్ స్పందించారు.
‘సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే వైసీపీ హయాంలో పరీక్షా విధానం మార్చడం వల్ల పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈ లో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అన్నట్టు మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి..’ అంటూ జగన్కు ట్విట్టర్లో విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం
— Lokesh Nara (@naralokesh) September 16, 2024
మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో… https://t.co/bMd4dvM9ou