పిల్లల ఉజ్వల భవిష్యత్తు కాపాడడానికి గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలిస్తాం: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

by Anjali |
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కాపాడడానికి గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలిస్తాం: మంత్రి గుమ్మడి సంధ్యారాణి
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లల ఉజ్వల భవిష్యత్తు కాపాడడానికి గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని ఏపీ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణని ముఖ్యమంత్రి కమిటీకి అప్పగించారని తెలిపారు. కమిటీ ఉద్దేశ్యమే.. 100 రోజుల్లోనే గంజాయిని నియంత్రించడమని చెప్పుకొచ్చారు. గంజాయి వల్ల రాష్ట్రంలో స్కూల్ పిల్లలు చాలా పాడైపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా గంజాయి వాడకం వల్ల ఎక్కువగా టీనేజ్ పిల్లల మానస్థిక స్థితి పాడై, ఎదురుగా ఉన్నటువంటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం, అలాగే మహిళల్ని ఇబ్బంది పెట్టడం, వారిపై ఆత్యచారాలకు పాల్పడటం వంటివి చేస్తున్నారని వెల్లడించారు. చిన్న చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయి వల్ల ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటున్నారన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కడపడితే అక్కడ విరివిగా దొరకడం వల్ల యువత ఎక్కువగా గంజాయికి అడక్ట్ అవుతుందన్నారు. ముఖ్యంగా ఈ గంజాయి మత్తులో వారిలో వారే పిచ్చిలేపుకుని ఆత్మహత్యలు చేసుకోవడం, ఆడవాళ్ల మీద ఆత్యాచారాలు జరపడం చేస్తున్నారని పేర్కొన్నారు.

కాగా గంజాయి, డ్రగ్స్ వాడకం తగ్గినట్లైతే మన రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా వరకు కంట్రోల్‌లో ఉంటాయనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి గంజాయిని కంట్రోల్ చేయడానికి వంద రోజులకు ఒక సబ్ కమిటీ వేశారని వెల్లడించారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ను తయారుచేసి చంద్రబాబు ఒక సైకో చేతిలో పెట్టి వెళ్తే.. సైకో జగన్ గంజాయి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాడన్నారు. ఒకటి కాదు రెండు కాదు చాలా దారుణంగా దరిద్రంగా మార్చాడని మండిపడ్డారు. ఆయన పాలనకు ప్రజలు విసిగేత్తిపోయారన్నారని వెల్లడించారు. వేరే జిల్లాల నుంచి వచ్చిన గిరిజనులు కూడా అక్కడున్న గిరిజనులను ప్రలోభపెట్టి, భయపెట్టి కాఫీ తోటల్లో గంజాయి తోటలు పండించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాగా ఇవన్నీ అరికట్టేందుకే ప్రజల కోసం ఈ రోజు మేం ముందడుగు వేస్తున్నామని, 100 రోజుల్లో గంజాయిని, డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో అరికడతామని మంత్రి సంధ్యారాణి ఏపీ ప్రజలకు హామీ ఇచ్చింది.



Next Story