Nara Lokesh : శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలో నారా లోకేశ్ దంపతులు

by Shiva |
Nara Lokesh : శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలో నారా లోకేశ్ దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం లోకేష్, సతీమని బ్రాహ్మణి ఆలయ మూల విరాట్ మల్లికార్జున స్వామి వారికి మహా రుద్రాభిషేకం, కుంకుమార్చన చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ, ప్రసాదాలను అందజేసి ఆశీర్వచాలు ఇచ్చారు. అంతకు ముందు వారు సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.



Next Story