ప్రాణాలు తీసిన ఈత సరదా

by Seetharam |
ప్రాణాలు తీసిన ఈత సరదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర మున్నేరు దగ్గర యువకులు గల్లంతు అయ్యారు. సోమవారం మధ్యాహ్నం కీసర మున్నేరు వద్ద ఐదుగురు యువకులు సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. అయితే లోతు గుర్తించని ఐదుగురు యువకులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. అయితే గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో ఐదుగురిని స్థానికులు కాపాడారు.అయితే అప్పటికే ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారిని నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు.. క్షతగాత్రులు ఐతవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed