AP News:రైతుల సమస్యలు తీర్చడానికే ‘పొలం పిలుస్తోంది’..!

by Jakkula Mamatha |
AP News:రైతుల సమస్యలు తీర్చడానికే ‘పొలం పిలుస్తోంది’..!
X

దిశ, మంత్రాలయం రూరల్/పెద్దకడుబూరు: పెద్దకడుబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో ‘పొలం పిలుస్తుంది’.. అనే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో శ్రీనాథ్, ఏవో వరప్రసాద్ హాజరయ్యారు. రైతులతో వివిధ పంటల గురించి మాట్లాడుతూ.. వర్షపు నీటికి నష్టపోయిన రైతులకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వర్షపు నీటిలో మునిగిపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. ఏవో వరప్రసాద్ ప్రతి ఒక్క రైతు పంట నమోదు చేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వేరుశనగ, పత్తికి అధికంగా ఎరువులు వేయకూడదని తెలియజేశారు. తగిన మొత్తంలో ఎరువులు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఆర్.బి.కె బజారి మరియు టీడీపీ గ్రామ నాయకులు నరసింహులు, మానప్ప, నాగేష్, రాజు, అయ్యప్ప, బసప్ప, తిక్కన్న, వీరేష్, హుసేని, నరసింహారెడ్డి, తిక్కన, కాసింవలి, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed