BREAKING: నామినేషన్ వేసేందుకు సిద్ధమైన "విడదల రజిని" కిడ్నాప్

by Disha Web Desk 12 |
BREAKING: నామినేషన్ వేసేందుకు సిద్ధమైన విడదల రజిని కిడ్నాప్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ ఎన్నికల వేళ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విడుదల రజిని అనే మహిళ స్వాతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీ నేత విడదల రజిని పేరు ఉండటంతో ఆమెకు ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న సదరు మహిళను అక్కడి నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా తీసుకెళ్లారు. అయితే నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళా అభ్యర్థిని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. కాగా వైసీపీ నేతలు మాత్రం ఆ మహిళను టీడీపీ నే నామినేషన్ వేయించే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నారు. కాగా మహిళా కిడ్నాప్ వార్తలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ ఎక్కడ ఉన్నదో గుర్తించినట్లు తెలుస్తొంది.



Next Story

Most Viewed