PM మోడీ పై జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు!

by Jakkula Mamatha |   ( Updated:2024-06-07 08:51:11.0  )
PM మోడీ పై జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్డీయే ఎంపీల భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, నితీష్ సహా తొమ్మిది మంది ఎన్డీయే మిత్రపక్షాల నేతలు వేదిక పై ఉన్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ మద్దతుతో ఏపీలో ఎన్డీయే కూటమి 91 శాతం స్థానాలు కైవసం చేసుకుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు ప్రధానిగా ఉన్నంతకాలం ఈ దేశం ఎవరికి తలవంచదు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. మీ పనులు, అభివృద్ధితో దేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించారు. అందరిలో స్ఫూర్తిని నింపారని చెప్పారు. మీ మద్దతుతో ఏపీలో భారీ మెజారిటీతో గెలిచాం అని జనసేనాని చెప్పారు. జనసేన తరఫున మిమ్మల్ని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా బలపరుస్తున్నా అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed