మాపై కక్ష తీర్చుకోవడానికి వరదలను ఉపయోగించుకోవడం దురదృష్టకరం: అంబటి రాంబాబు

by Mahesh |
మాపై కక్ష తీర్చుకోవడానికి వరదలను ఉపయోగించుకోవడం దురదృష్టకరం: అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవడానికి వరదలను ఉపయోగించుకోవడం దురదృష్టకరం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల ప్రమాదంపై ఆయన స్పందించారు. ఎవరు ఉహించని విధంగా భారీగా వరదలు వచ్చాయని.. ఈ క్రమంలోనే అనేక బోట్లు వరదలో కొట్టుకు వచ్చాయన్నారు. అలాగే ఈ వరదల సాకుతో వైసీపీ నేతలు, జగన్ సన్నిహితులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఇందులో భాగంగా సీఎం, హోంమంత్రి.. బ్యారేజీ వద్ద ప్రమాదానికి కారణమైన బోట్లపై వైసీపీ రంగులు ఉన్నాయని అంటున్నారని ఫైర్ అయ్యారు. జగన్ అంటే భయం వల్లే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుందని.. అంబటి రాంబాబు ఆరోపించారు. అలాగే నంబూరి శంకర్రావు వరద ప్రాంతాలకు వెళితే టీడీపీ కార్యకర్తలు కార్లు పగలగొట్టారని.. రెడ్‌ బుక్‌ పరిపాలన అంటే ఇదేనని.. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్నారని అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed