తిరుపతిలో హై టెన్షన్.. మరోసారి బాంబు బెదిరింపులు

by Y.Nagarani |   ( Updated:2024-10-26 05:49:12.0  )
తిరుపతిలో హై టెన్షన్.. మరోసారి బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్: గురువారం అర్థరాత్రి తిరుపతి (Tirupati)లోని కొన్ని హోటళ్లకు బాంబు బెదిరింపులు రాగా.. పోలీసులు ఆయా హోటళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లలో ఎక్కడా బాంబులు లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి తిరుపతిలోని 2 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలిపిరి (Alipiri) పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌పార్క్‌, పాయ్‌వైస్రాయ్‌ హోటల్‌ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఐఎస్ఐ ఉగ్రవాదుల (ISI Terrorists) పేరుతో 2 మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. డాగ్ స్క్వాడ్ (Dog Squad)తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఉగ్రవాదికి జైలుశిక్ష వేయడం వెనుక సీఎం స్టాలిన్ హస్తం ఉండగా.. తమిళనాడులో కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే వారికి సంబంధించి తిరుపతిలో ఉన్న హోటళ్లకు 2 రోజుల క్రితం ఉగ్రవాదుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా వచ్చిన బెదిరింపులతో తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed