- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AP Pensions:పెన్షన్ల పంపిణీ పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
దిశ,వెబ్డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ పై చంద్రబాబు సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు 31న (శనివారం) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1న ఆదివారం కావడం, ఆరోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 పెన్షన్లు తీసుకోని వారికి సెప్టెంబర్ 2న ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కావున ఏపీ ప్రభుత్వం పలు కీలక హామీలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.