Tirumala News:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-10-08 15:15:05.0  )
Tirumala News:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్రీ వారి భక్తులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో తిరుమల శ్రీవారి భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న(సోమవారం) 81,481 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 38,762 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లుగా నమోదు అయింది.

Advertisement

Next Story

Most Viewed