మిజోరాం గవర్నర్ హరిబాబుకు హీరో నాగార్జున పరామర్శ

by Y. Venkata Narasimha Reddy |
మిజోరాం గవర్నర్ హరిబాబుకు హీరో నాగార్జున పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్ : వైజాగ్ లో ఇటీవల అనారోగ్యానికి గురైన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును హీరో నాగార్జున పరామర్శించారు. హరిబాబు ఇటీవల గుండె సంబంధిత శస్ర్త చికిత్స చేయించుకున్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో కలిసి నాగార్జున హరిబాబు నివాసానికి వెళ్ళి పరామర్శించారు. మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యల అనంతరం అక్కినేని నాగార్జున తొలిసారిగా మీడియా ముందు కనిపించారు. అయితే ఆయన కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే తమ కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై లీగల్ గా ముందుకెలుతానని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు.

Next Story

Most Viewed