100 అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనానికి రూ.26.25 లక్షల విరాళం.. ఆయన్ను అభినందించిన CM

by Anjali |   ( Updated:2024-08-26 14:42:39.0  )
100 అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనానికి రూ.26.25 లక్షల విరాళం.. ఆయన్ను అభినందించిన CM
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యాపారవేత్త..సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు తన జన్మదినం సందర్భంగా అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకు సోమవారం (ఆగస్టు 26) విరాళంగా అందజేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్నక్యాంటీన్లలో ఒక రోజు భోజనానికి అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చిన గురుస్వామి నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడలో బాబు ఆగస్టు 15 వ తారీకున అన్న క్యాంటీన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో క్యాంటీన్లు తెరిచారు. 49 మున్సిపాలిటీల్లో వంద క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. ప్రతి క్యాంటీన్ ద్వారా ఏపీ ప్రజలకు పూటకు35 మందికి భోజనం అందుతుంది. తర్వాత రద్దీని బట్టి సంఖ్యను పెంచుతామని ప్రారంభం నాడే ఏపీ సీఎం వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed