అర్హత లేని వ్యక్తి పార్టీలో పని చేశా.. పవన్‌పై చేగొండి సూర్య ప్రకాశ్ తీవ్ర విమర్శలు

by srinivas |
అర్హత లేని వ్యక్తి పార్టీలో పని చేశా.. పవన్‌పై చేగొండి సూర్య ప్రకాశ్ తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: కాపు నేత హరి రామజోగయ్య తనయుడు చేగొండి సూర్య ప్రకాశ్ వైసీపీలో చేరారు. 2018లో జనసేనలో చేరిన ఆయన తాజా ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితా సూర్య ప్రకాశ్‌ను నిరాశపర్చింది. దీంతో జనసేన పార్టీకి ఆయన గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో శుక్రవారం సాయంత్రం సూర్య ప్రకాశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అర్హత లేని వ్యక్తి పార్టీలో ఇన్నాళ్లూ పని చేశానని విమర్శలు చేశారు. ఇక నుంచి సీఎం జగన్ కోసం పని చేస్తానని చెప్పారు. తాను ఏమీ ఆశించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని సూర్య ప్రకాశ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ స్వార్థం, స్వలాభం కోసం పని చేస్తున్నారని మండిపడ్దారు. అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రం తరిమికొట్టాలని సూర్య ప్రకాశ్ పిలుపునిచ్చారు. ఇక సీఎం జగన్ పేదలకోసం ప్రతినిత్యం పని చేస్తున్నారని తెలిపారు.

Read More..

పవన్ కల్యాణ్‌పై NTR సతీమణి లక్ష్మీపార్వతీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed