Dussera Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన

by srinivas |
Dussera Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దసరా సెలవుల(Dussera Holidays)పై స్పష్టత వచ్చింది. అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు పండగ హాలిడేస్‌ను ప్రకటించింది. అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి లోకేశ్(Minister Lokesh).. దసరా సెలవులపై కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకూ మొత్తం 11 రోజుల పాటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో వచ్చిన వరద కారణంగా టీచర్ డేను నిర్వహించలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే‌ను బాగా సెలబ్రేట్ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే నవంబర్ 14న మెగా పేరెంట్స్‌-టీచర్స్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తాము స్వయంగా రివ్యూ చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed