Breaking: ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతం సవాంగ్ రాజీనామా

by srinivas |
Breaking: ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతం సవాంగ్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతం సవాంగ్ రాజీనామా చేశారు. ఉద్యోగ విరమణకు మరో రెండేళ్ల గడువు ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. సవాంగ్ రాజీనామాను పరిశీలించిన ఆయన వెంటనే ఆమోదం తెలిపారు.

కాగా గత ప్రభుత్వ హయాంలో గౌతం సవాంగ్ ఏపీ డీజీపీగా పని చేశారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకూ ఆయన పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నిమమితులయ్యారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండటంతో, వైసీపీ ఘోర ఓటమికావడంతో గౌతం సవాంగ్ రాజీనామా చేసినట్లు పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Next Story

Most Viewed