గంటా రియల్ ఎస్టేట్ బ్రోకర్: మాజీ మంత్రి అవంతి

by Disha Web Desk 16 |
గంటా రియల్ ఎస్టేట్ బ్రోకర్: మాజీ మంత్రి అవంతి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో భీమిలీలో గంటా, అవంతి పోటీ చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గంటా శ్రీనివాస్‌తో పాటు ఆయన అనుచరులు సైతం రియల్ ఎస్టేట్ బోకర్లని సంబోధించారు. వ్యాపారాల కోసమే గంటా శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. గంటా శ్రీనివాస్ మైండ్ గేమ్ ఆడుతున్నారని.. ఆ పప్పులు తన వద్ద ఉడకవని హెచ్చరించారు. ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని, వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడం తథ్యమని చెప్పారు. భీమిలిలో గంటాకు ఓటమి తప్పదన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని అవంతి శ్రీనివాస్ జోస్యం చెప్పారు.

Next Story