వైసీపీ ఫోర్త్ లిస్ట్ రెడీ.. వారికే సీట్లు...!

by srinivas |
వైసీపీ ఫోర్త్ లిస్ట్ రెడీ.. వారికే సీట్లు...!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నాలుగో జాబితాపై కసరత్తులు పూర్తి అయ్యాయి. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించిన వైసీపీ అధిష్టానం ఈ మేరకు పలువురు పేర్లను పరిశీలించింది. చివరకు 8 నుంచి 9 మందిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లోనే వైసీపీ నాలుగో జాబితాను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ, మంత్రి బొత్స, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించనున్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసింది. ఈ జాబితాల్లో పలువురికి సీట్లు దక్కగా ఆశావహులకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయా నేతలు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. వారికి ప్రాధాన్యతనిచ్చే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పలువురు అయితే ఏ పార్టీలో చేరేది ఇప్పటికే స్పష్టం చేశారు.

మరోవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారం చేపట్టేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించిన పలు నియోజకవర్గాలకు ఇంచార్జులను మార్చితే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిసింది. దీంతో చాలా నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమించారు. తాజాగా కూడా మరో జాబితాను విడుదల చేయబోతున్నారు. లిస్టు విడుదల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed