నడిరోడ్డుపై మొసలి కలకలం

by Y. Venkata Narasimha Reddy |
నడిరోడ్డుపై మొసలి కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : నీళ్ళల్లో ఉండే ఓ భారీ మొసలి రహదారిపై ప్రత్యక్షమైంది. రోడ్డు దాటే ప్రయత్నంలో అటుఇటు తిరగడంతో ఆ మార్గంలో చీలట్లో వెలుతున్న భారీ లారీలు, ఇతర వాహనదారులు హెడ్ లైట్ల కాంతుల్లో మొసలిని చూసి అవాక్కై సడన్ బ్రేక్ లు వేసుకోవాల్సివచ్చింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో రోడ్డుపై మొసలి సంచారం కలకలం రేపింది. పొలాల్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలిని చూసి వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు మొసలి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. తరుచు ఈ మార్గంలో మొసళ్ళ సంచారం సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed