Tirumala: శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల ఇక్కట్లు..

by Indraja |
Tirumala: శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల ఇక్కట్లు..
X

దిశ వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి నిత్యం దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎందరో భక్తులు కాలి నడకన స్వామిని చేరి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఎప్పటిలానే దేవుని దర్శనానికి వచ్చిన భక్తులు నిన్న అర్ధరాత్రి నుండి ఇబ్చందులను ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మార్గమధ్యలో తనిఖీల పేర్లతో అధికారులు వాహనాలను నిలిపివేస్తున్నారు.

కేవలం కొండపైకి ఆటోలకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీనితో తెల్లవారుజాము ఒంటి గంట నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో భక్తుల తీవ్ర ఇబ్భందులను ఎదుర్కొంటున్నారు. కగా మెట్ల మార్గం ద్వారా దర్శనానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు.



Next Story