ఏపీలో సమగ్ర కుల గణన ప్రారంభం.. అదృష్టమన్న మంత్రి చెల్లుబోయిన వేణు

by Seetharam |
ఏపీలో సమగ్ర కుల గణన ప్రారంభం.. అదృష్టమన్న మంత్రి చెల్లుబోయిన వేణు
X

దిశ , డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం బుధవారం నుంచి రాష్ట్రంలో సమగ్ర కులగణనకు శ్రీకారం చుట్టనుంది. రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ సమగ్ర కులగణన చేపట్టనుంది. ఈ రెండు రోజుల ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియను రామచంద్రాపురం నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామ సచివాలయ పరిధిలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కులగణన ప్రక్రియకు సంబంధించి సర్వేను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పరిశీలించారు. కులగణన ప్రక్రియ రాష్ట్రంలో మొదలు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ చిత్రపటానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పాలాభిషేకం చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.‘గ్రామ స్వరాజ్యమనే మహాత్ముల లక్ష్యాన్ని సాధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనగణన తప్ప కులగణన జరగలేదన్నారు. నేడు మన రాష్ట్రంలో డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కులగణనతో సాధించబోతున్న నాయకుడు వైఎస్ జగన్’ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. ఉన్నతవర్గాలలోని పేదలతోపాటు, వెనుకబడిన వర్గాల, బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఈ కులగణన వెలుగులు నింపనుంది అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అభిప్రాయపడ్డారు.

సమగ్ర కులగణనలో భాగస్వామిని కావడం సంతోషం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు ఈ కులగణన జరగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. బీసీలకు సేవ చేయడం తనకు ఎంతో ఇష్టం అని అభిప్రాయపడ్డారు. ఈ బాధ్యతను సీఎం వైఎస్ జగన్ తనకు అప్పగించడం సంతోషకరంగా ఉందన్నారు. సమగ్ర కులగణన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి జీవితానికి భద్రతగా ఉపయోగపడుతుందని అన్నారు. నేడు పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్న రెండు రోజుల కుల గణన పక్రియను తన నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామంలో పరిశీలించినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల పైలెట్ ప్రాజెక్టులో ఎలాంటి అంశాలు ఎదురవుతున్నాయి..వాటిని ఎలా పరిష్కారించాలనే వాటిపై అధ్యయనం చేస్తాం అని చెప్పుకొచ్చారు. అధికారులకు కూడా ఏ చిన్న అంశం కూడా వదలకుండా కులగణన ప్రక్రియ జరపాలని సూచించడం జరిగిందన్నారు. పేదవాడి సొమ్మును ఎలా దోచుకోవాలో గత ప్రభుత్వం చూస్తే...పేదవాడి సొమ్మును ఎలా పేదవారికి చేర్చాలో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని కొనియాడారు. అందుకు నిదర్శనమే ఈ సమగ్ర కులగణన ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. సమగ్ర కులగణన ద్వారా తమ వర్గాల యొక్క మనోభావాలను రక్షించిన నాయకుడిగా వైఎస్ జగన్ నిలిచారన్నారు. కులగణన ప్రక్రియలో తనను కీలకమైన భాగస్వామ్యం చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed