CM Chandrababu:రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

by Jakkula Mamatha |
CM Chandrababu:రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. ఏపీకి నిధుల విడుదలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు (సోమవారం) తిరుపతి శ్రీ సిటీలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. రేపటి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో రేపు(సోమవారం) ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు. ఇక్కడి సోమశిల ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇక్కడ వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed