CM Chandrababu:వైసీపీ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-11 14:50:39.0  )
CM Chandrababu:వైసీపీ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఎన్నికల్లో ఓడించారని ప్రజలపై ద్వేషం పెంచుకునే పార్టీని ఏమనాలో తనకు తెలియట్లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) వల్ల వరద(Flood) నీరు అల్లకల్లోలం సృష్టించాయి. ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో నేడు(బుధవారం) సీఎం చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విజయవాడకు వరదలు(Flood) వచ్చాయని ఆరోపించారు.

వైసీపీ పార్టీ ఏపీలో ఉండడం దురదృష్టం అని సీఎం చంద్రబాబు అన్నారు. నేరస్థులకు రాజకీయ ముసుగు లేకపోతే వారిని ఆపేందుకు రెండు నిమిషాలు చాలు అని సీఎం చెప్పారు. నేరస్థుడితో రాజకీయాలు చేయడం నామోషీగా ఉందన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రౌడీలు రోడ్లపైకి వచ్చేవారు కాదని చెప్పారు. రాయలసీమలో ముఠాలను అణచివేశానన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్న వ్యక్తిని బురదలో తిరిగేలా చేశానని సీఎం చంద్రబాబు అన్నారు. నేరాలు చేసే వ్యక్తులు ప్రజా జీవితంలో ఉంటూ..ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మొత్తం దోచేసిందని, అప్పులు మిగిల్చిందని..వాటిని భర్తీ చేస్తున్నామని, ఖాళీ ఖజనాతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story