- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
11 రోజుల తర్వాత సెక్రటేరియట్కు సీఎం చంద్రబాబు
X
దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు నెల చివర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడలోని బుడమేరు వాగు పొంగి పొర్లింది. దీంతో బెజవాడలోని అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరద కారణంగా వేల సంఖ్యలో ప్రజలు వరద బాధితులుగా మిగిలిపోయారు. ఈ క్రమంలో ఈ నెల 1న హుటాహుటిన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు.. వరదలు తగ్గి, పరిస్థితులు మొత్తం చక్కబడ్డాక ఇక్కడి నుంచి వెళతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో గత పది రోజులుగా జిల్లా కలెక్టరేట్ లో ఉంటున్న సీఎం చంద్రబాబు నాయుడు 11 రోజుల తర్వాత ఈ రోజు సెక్రటేరియట్ కు వచ్చారు. వచ్చి రాగానే వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Next Story