- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైదరాబాద్-అమరావతి హైవేపై కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు చర్చలు
దిశ,వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో నేడు(గురువారం) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. ఈ క్రమంలో అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేల నిర్మాణం త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు సమాచారం. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహనాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.