- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఈ నెల 9న పుంగనూరుకు మాజీ సీఎం జగన్.. కారణం ఏంటంటే?
దిశ,వెబ్డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరులో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య జరిగిన ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ అక్టోబర్ 9న పరామర్శించనున్నారు. వివరాల్లోకి వెళితే.. నేడు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. పోలీసులు వెంటనే ఈ ఘటన పై స్పందించి దోషులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో తారీఖున మాజీ సీఎం జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.