ఈ నెల 9న పుంగనూరుకు మాజీ సీఎం జగన్.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
ఈ నెల 9న పుంగనూరుకు మాజీ సీఎం జగన్.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరులో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య జరిగిన ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ అక్టోబర్ 9న పరామర్శించనున్నారు. వివరాల్లోకి వెళితే.. నేడు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. పోలీసులు వెంటనే ఈ ఘటన పై స్పందించి దోషులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో తారీఖున మాజీ సీఎం జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed