CM Chandrababu:ఒలింపిక్స్‌లో మనుభాకర్‌కు కాంస్యం..సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్

by Jakkula Mamatha |
CM Chandrababu:ఒలింపిక్స్‌లో మనుభాకర్‌కు కాంస్యం..సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్
X

దిశ,వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 10 మీ. ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్‌లో మను భాకర్ 221.7 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళా పిస్టల్ షూటింగ్ విభాగంలో కాంస్యం పతకం సాధించిన మను భాకర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెను చూసి దేశం గర్వపడుతోందని ద్రౌపది ముర్ము తెలిపారు. భారత దేశానికి తొలి పతకాన్ని అందించడంతో పాటు, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కావడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed