విజయవాడ లాయర్ల బస్సుప్రమాదం.. సంతాపం ప్రకటించిన సీఎం చంద్రబాబు

by Y.Nagarani |
విజయవాడ లాయర్ల బస్సుప్రమాదం.. సంతాపం ప్రకటించిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: న్యాయవాదుల బస్సుకు జరిగిన ప్రమాదంలో లాయర్ సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందడంపై సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మహిళలు, విద్యార్థినులను చైతన్య పరిచేలా ఆమె కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నానని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.

ఈ ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం విచారకరమని పేర్కొన్నారు. న్యాయవాది రాజేంద్రప్రసాద్ భార్య ఈ ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్రప్రసాద్, ఇతర లాయర్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

బెజవాడ బార్ అసోసియేషన్ కు చెందిన లాయర్లు రెండు బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు. అజ్మేర్ వద్ద ఒక బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో.. లాయర్ రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మరణించారు. మరో 11 మందికి గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed