ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు

by Mahesh |
ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలదేరారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు సీఎం ఢిల్లీ చేరుకొనున్నారు. అనంతరం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అలాగే రేపు(జూలై 17 బుధవారం) ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, త్వరలో కేంద్ర ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే వాటాలపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే అమరావతి రాజధానికి ప్రత్యేక నిధుల విషయం కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.



Next Story