రోజా, ధర్మానపై విచారణకు ఆదేశించిన సీఐడీ

by M.Rajitha |
రోజా, ధర్మానపై విచారణకు ఆదేశించిన సీఐడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రోజా, ధర్మాన కృష్ణదాస్ లపై విచారణకు సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, ఆ నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని సీఐడికి ఫిర్యాదులు అందగా.. వారిపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని సీఐడీ అడిషనల్ డీజీ ఆదేశించారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో వీరు అవినీతికి పాల్పడ్డారని, వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవలంటూ ఆట్యాపాట్యా సంస్థ సీఈ వో ప్రసాద్ సీఐడికి ఫిర్యాదు చేశారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed