Ap News: తిరుపతిలో జంట హత్యలు.. విచారణ ముమ్మరం

by srinivas |
Ap News: తిరుపతిలో జంట హత్యలు.. విచారణ ముమ్మరం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఓ వ్యాపారి ఇంట్లోకి యువకుడు చొరబడి వృద్ధురాలు, ఆమె మనవరాలిని కొట్టి చంపారు. అనంతరం బైక్‌పై తిరుపతి రైల్వే స్టేషన్‌కు వెళ్లి హైదరాబాద్ ట్రైన్ ఎక్కారు. సీసీ ఫుటేజుల ద్వారా నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పాత కక్షలా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed