తిరుమలలో సీఎం ఫ్యామిలీ.. శ్రీవారికి 11వసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-10-04 12:33:13.0  )
తిరుమలలో సీఎం ఫ్యామిలీ..  శ్రీవారికి 11వసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలకు సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ(CM Chandrababu Naidu Family) చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మెత్సవాల(Srivari Brahmatsavalu) సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు స్వామివారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల వెంకన్నకు ఇప్పటి వరకు పది సార్లు పట్టువస్త్రాలు అందజేశారు. తాజాగా 11వసారి స్వామివారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా చంద్రబాబు ఫ్యామిలీ శుక్రవారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. నూతనంగా నిర్మించిన వకుళామాత నూతన వంటశాలను శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed