- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Breaking : అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి 2 లక్షల రూపాయలు అలాగే క్షతగాత్రులకు 50,000 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంవో ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని,పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
కాగా.. రియాక్టర్ పేలుడు తర్వాత సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించారని సుమారు 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ముఖ్యమంత్రి గురువారం పరామర్శించనున్నారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.