Breaking : అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

by Maddikunta Saikiran |
Breaking : అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి 2 లక్షల రూపాయలు అలాగే క్షతగాత్రులకు 50,000 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంవో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని,పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

కాగా.. రియాక్టర్ పేలుడు తర్వాత సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించారని సుమారు 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ముఖ్యమంత్రి గురువారం పరామర్శించనున్నారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Next Story

Most Viewed