కాంగ్రెస్ లో చేరిన బిగ్ బాస్ సెలబ్రెటీ

by M.Rajitha |
కాంగ్రెస్ లో చేరిన బిగ్ బాస్ సెలబ్రెటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు బిగ్ బాస్ సెలెబ్రెటీ నూతన్ నాయుడు ఏపీ కాంగ్రెస్ లో చేరారు. శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కండువా కప్పుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ కాంగ్రెస్ లో ఓ సెలెబ్రెటీ చేరడం ఇదే ప్రథమం. కాగా షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పటి నుండి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోవడానికి షర్మిల చేసిన ప్రచారం కూడ ప్రధాన కారణం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ చేరికల ప్రక్రియ మొదలు పెట్టి.. నూతన్ నాయుడును చేర్చుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా మార్చడానికి షర్మిల వ్యూహ రచనలు చేస్తునట్టు సమాచారం. కాగా పార్టీలో చేరిన నూతన్ నాయుడుకు ఎలాంటి భాధ్యతలు ఇస్తారో వేచి చూడాలి.

Next Story

Most Viewed