AP Govt.: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ ఐపీఎస్‌పై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఆర్డర్స్

by Shiva |
AP Govt.: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ ఐపీఎస్‌పై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఆర్డర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి సర్కార్ పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో వైసీపీ (YCP) నాయకులతో అంటకాగి.. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై (PV Sunil Kumar, IAS) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఆయనపై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఆర్డర్స్ వెలువడ్డాయి. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed