Ap Elections: ఎన్నికల మేనిఫెస్టోపై సజ్జల కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Ap Elections: ఎన్నికల మేనిఫెస్టోపై సజ్జల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో 11 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ కూటమి తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే వైసీపీ మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయగలిగినవేనని సజ్జల తెలిపారు. అలివిగాని హామీలు ఇవ్వలేదని చెప్పారు. తమ మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రజలకు మేలు చేసే పథకాలు మేనిఫెస్టోలు పెట్టామని తెలిపారు. ‘ ఎన్నికలు వస్తున్నాయని ఎడా పెడా హామీలు ఇవ్వడంలేదు. పేదల జీవితాల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నాం. మేము చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాం. కరోనా సమయంలోనూ పథకాలు ఆపలేదు. రాష్ట్రాభివృద్ధిని కొనసాగించాం. కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. పింఛన్ రూ.3 వేలు అందించాం.’ అని సజ్జల పేర్కొన్నారు.

Read More..

ఎన్నికల వేళ ఉద్యోగులకు.. షాక్ ఇచ్చిన జగన్ సర్కార్?

Next Story

Most Viewed